ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై ఆ దేశాలను బాధ్యులుగా చేయాలి'

author img

By

Published : Nov 17, 2020, 5:21 PM IST

Updated : Nov 17, 2020, 6:39 PM IST

ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. బ్రిక్స్​ 12వ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్​గా ప్రసంగించిన మోదీ.. ఈ సమస్యను సంస్థాగతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

BRICS Summit
మోదీ

ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతపన్న 12వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్​గా ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, వాణిజ్యం తదితర అంశాలపై ప్రస్తావించారు.

ఉగ్రవాదానికి మద్దతునిస్తోన్న దేశాలను బాధ్యులను చేయాలని పరోక్షంగా పాకిస్థాన్​ను ఉద్దేశించి మోదీ డిమాండ్ చేశారు. ఈ సవాలు​ను సంస్థాగతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో బ్రిక్స్ దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్​, జెయిర్ బొల్సోనారో, షీ జిన్​పింగ్, సిరిల్ రమఫోసా పాల్గొన్నారు.

ఐరాస సంస్కరణలపై..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు మోదీ. వీటితోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మార్పులు జరగాలన్నారు.

కరోనా వేళ భారత వ్యాక్సిన్​ ఉత్పత్తి, సరఫరా విషయంలో మానవత్వంతో పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు.

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాతో కూడిన బ్రిక్స్ కూటమి.. 360 కోట్ల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిక్స్ దేశాల జీడీపీ మొత్తం 16.6 ట్రిలియన్ డాలర్లు.

ఇదీ చూండి: మోదీ-ట్రంప్​ బంధాన్ని బైడెన్​ ఎలా స్వీకరిస్తారు?

Last Updated :Nov 17, 2020, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.